Total Pageviews

Tuesday, January 22, 2013

తెలంగాణా ఉద్యమం - మీడియా శిఖండి పాత్ర

ఎవరు అవునన్నా కాదన్నా హైదరాబాద్ కేంద్రంగా నడిచే అన్ని ప్రధాన పత్రికలలోనూ మావోయిస్టు సానుభూతిపరులు పత్రికా విలేఖరులుగా, సబ్-ఎడిటర్లుగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ మావోయిస్టు భావజలంతోనే వీరంతా తెలంగాణా ఉద్యమానికి తమవంతుగా మసాలా వార్తలు వండి వడ్డిస్తున్నారు. ఒకటిని పదిగా, పదిని వెయ్యిగా రాసి ఉద్యమానికి "తమవంతు సహకారం" అందిస్తున్నారు. ఇలాంటి తప్పుడు రాతలు రాస్తుంటే యాజమాన్యాలు ఎందుకు ఊరుకున్నాయని అనుమానం రావచ్చు. దానికి కూడా బలమైన కారణం ఉంది. "ఆ రెండు" పత్రికలకు జగన్ బూచి, మిగతా/జగన్ అనుకూల పత్రికలకు కాంగ్రెస్/CBI బూచి. ఈ రెండు వర్గాల పత్రికా యాజమాన్యాల కి తమకు నచ్చినట్టుగా అవతలి వారిపై వార్తలు రాయాలంటే కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు పోవాలి. ఆ పనిని తెలంగాణా విషయం లో చేస్తున్నాయి ఈ యాజమాన్యాలు.

ఒక వర్గం మీద ఒక ప్రాంతం వారి మీద బురద చల్లడానికి, విషం చిమ్మడానికి ఎంతకైనా వెనుకాడవు ఈరోజుల్లో పత్రికలు, మీడియా. దానికోసం కొత్త పదాలను కూడా పుట్టిస్తాయి. "సీమాంధ్ర" అనే రాక్షస సమాస పదం అలా పుట్టిందే...."ఆంధ్ర" పదం అనే మాట నైజం తెలంగాణ లో ఒక పెద్ద బూతు మాటలా మార్చేసారు విద్వేషం వెళ్లగక్కే నాయకులూ, వారిని మించిన మీడియా ప్రతినిధులు. ఎవరైనా నైజం తెలంగాణా ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకoగా మాట్లాడే పరిస్తితి లేదు గత కొన్ని సంవత్సరాలుగా. అంతలా ప్రజలను భయభ్రాంతులను చేసింది (కెసిఆర్ )కచరా గారి పార్టీ. ఆ పార్టీ కార్యకర్తలు లేని చోట్ల ఆ పనిని మీడియా ప్రతినిధులు నిస్సంకోచoగా చేస్తున్నారు. దానికి ఉదాహరణ లగడపాటి మీటింగులు, సమైక్యాంధ్ర సమావేశాలు. అన్నింటిని మించి రెండేళ్ళ నాటి నల్లమోతు చక్రవర్తి గారి పుస్తకావిష్కరణ సభ ఎంత రసాభాస చేసారో అందరూ చూసారు. ఆనాటి సభని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెరాస కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసాక వాళ్ళు లేని లోటు పత్రికా ప్రతినిధులే పూడ్చారు. చక్రవర్తిని అక్కడినుంచి పంపేయడానికి ప్రయత్నించిన ఒక పోలీసు అధికారిని మీడియా వాళ్ళమన్న ముసుగులో నానా దుర్భాషలాదారు. ఆరోజు పోలీసులు సంయమనం పాటించి ఉన్నారు కానీ ఏ కొద్ది చర్య తీసుకొని ఉన్నా మీడియా పై పోలీసు దాడి అని ఎంత రభస చేసి ఉండేదో ఈ మీడియా వర్గం.
    
అత్యధిక సంఖ్యలో చందాదారులు ఉన్నారని గప్పాలు కొట్టుకొనే ఈనాడు కానీ, ఈనాడు కి అన్ని విషయాల్లో పోటీకి వచ్చే సాక్షి కానీ తెలంగాణా విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామనే మాట చెప్పమనండి? పాత రికార్డులు, రీసెర్చ్ లో కానీ, వనరుల విషయంలో కానీ,  ఈనాడు కు పోటీ వచ్చే సంస్థ ఇంకొకటి లేదన్నది నిజం.
కానీ ఇన్ని వనరులు, సదుపాయాలు ఉండి కూడా ఈనాడు పత్రిక తెలంగాణ విషయంలో అర్ధ సత్యాలు అబద్దాలకే ఎక్కువ విలువ ఇస్తోంది. అలా కాకుండా తనకున్న వనరులను సద్వినియోగం చేసుకొని ఏది నిజం ఏది అబద్దం అనేది ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత తీసుకొని ఉంటె రాష్ట్రం ఇలా రావణ కష్టం అయి ఉండేది కాదు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తీరుతెన్నులు, ఆఫ్ఘానిస్తాన్ లో పరిస్తుతులు, పశ్చిమ ఆసియా లో శాంతి ఇలాంటి అంతర్జాతీయ వ్యవహారాలపై నిపుణులతో వ్యాసాను వ్యాసాలు రాయించే ఈనాడు పత్రికకు సొంత రాష్ట్రం తగలబడి పోతుంటే చలి కాచుకుంటుంది కానీ తన వంతుగా సమస్య పరిష్కారానికి కృషి చేయదు. అంతెందుకు రెండేళ్ళ క్రితం శ్రీకృష్ణ కమిటీ కి రాష్ట్ర వ్యాప్తంగా అందరు తమ తమ అభిప్రాయాలు చెప్తే ఈనాడు ఆపాటి పని కూడా చేయలేక పోయింది.  సమాచార హక్కు మీద ప్రచారం చేసే హక్కు తనకే ఉందని బల్ల గుద్ది చెప్పే ఈనాడు, తెలంగాణా విషయంలో నిజాలను మాత్రం తొక్కి పెడుతుంది. స్వార్ధ రాజకీయ నాయకులు చేసే విషపూరిత ఉపన్యాసాలకి ఎక్కువ కవరేజ్ ఇచ్చే ఈనాడు, నిజాలు వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాళ్ళకి మాత్రం రెండో పేజి లోనో మూడో పేజి లోనో అది కూడా మొక్కుబడిగా ఇస్తుంది. అస్సలు ఈనాడులో ముఖ్య పేజీల్లో వార్తల్లో ఉండే వాళ్ళెవరో చూడండి. జగన్ గురించిన సంచలనాలు ఏమి లేకపోతే కిరణ్, బొత్స, బాబు, కెసిఆర్ పోను మిగిలిన వార్తలు అన్ని పేపర్ పులులు అయిన పొన్నం, వివేక్, గుత్తా, మందా, విహెచ్, కేకే ఇంకా మిగిలిన చిల్లర నాయకులు. తెలంగాణా ఉద్యమం అవతల వీళ్ళ పలుకుబడి ఏంటి? మూడేళ్ళ కిందట వీళ్ళల్లో ఎంత మంది పేరు రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు?
సాక్షి గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేదు; అది ఒక వ్యక్తి కరపత్రిక ఆ వ్యక్తికే భజన చేసే పత్రిక.
 ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి పత్రికలు ఆంధ్ర అన్న పదాన్ని బూతు మాటగా చూపిస్తూనే ఆ పేరుతోనే పత్రికను అమ్ముకుంటున్నాయి. అదే కోవలో నడుస్తున్న మరో పత్రిక విశాలాంద్ర. బూర్జువా పార్టీలు నడుస్తున్న ఎన్నికలు వోట్ల రాజకీయాల్లోనే నడుస్తూ ఉమ్మడి కమ్మూనిస్ట్ పార్టీ నినాదం అయిన విశాలాంధ్ర నుంచి దూరం నడిచి ఒక ప్రాంతం వారికీ కొమ్ము కాస్తూ మరొక ప్రాంతం వారిని నానా దుర్భాషలాడుతూ నోరు పారేసుకొనే నారాయణ గారు తమ పార్టీ ప్రాపకం తోనే నడిచే పత్రిక పేరు కూడా మార్చుకుంటే మరింత బాగుంటుంది.       






          

Sunday, January 20, 2013

సినారె


ప్రస్తుతం జీవించి ఉన్న లేదా గతకాలపు తెలుగు సాహితీవేత్తల్లో అత్యంత భావదారిద్ర్యం ఉన్న కవి ఎవరంటే అది ఖచ్చితంగా సినారె.
పూటకో మాట గడపకో పాట పాడడంలో సినారె ని మించినవారెవ్వరు లేరు. ఒకనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు "తెలుగుజాతి మనది నిండుగా వెలుగుజాతి మనది" అని దేశభక్తి గీతాలు రాసిన సినారె నేడు నాడు రాసిన పాటలన్నీ పొట్టకూటి కోసం రాసాను లేకపోతె రామారావు ఒత్తిడి మీద రాసాను అని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నాడు. 1970 లో రాసిన పాటను ఖండించడానికి మన జ్ఞానఫీఠ్ గారికి 32 సంవత్సరాలు పట్టింది, అదికూడా 17 సంవత్సరాల కింద స్వర్గస్తులైన రామారావు మీద నెపం మోపడానికి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేతకానీ, ప్రభుత్వేతర సంస్థలు, చలనచిత్ర రంగం ద్వారాకా నీ  అత్యంత లబ్ధి పొందిన సాహితివేత్తల్లో సినారెని మించిన వారెవ్వరు లేరు.  అంతెందుకు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత ప్రఖ్యాత జ్ఞానఫీఠ్ పొందిన రెండవ తెలుగు కవి సినారెనే. అది కూడా అయన ఇప్పుడు అడిపోసుకుంటున్న రామారావు హయంలోనే (1988) వచ్చింది. సినారె  కన్నా ప్రతిభావంతులైన  కవులు లేరా మన ఆంధ్ర దేశం లో? ఆంధ్రప్రదేశ్ సినరేకి చేసిన తక్కువేంటి? హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఏడు కాదు పది ఉన్నా, ఆ రాష్ట్రాలకి ఒకే సంస్కృతి సంప్రదాయం, తెలుగు వారిలా  ఉమ్మడి ఘన  వారసత్వం ఉందా?
చరిత్రలో ఏ రెండు హిందీ మాట్లాడే రాష్ట్రాలు అయినా మొఘలాయీలు తప్ప ఒకే రాజు పరిపాలన కింద ఎప్పుడైనా
ఉన్నాయా?

స్వార్ధ రాజకీయనాయకులు ఇలా మాట్లాడారంటే రాజకీయం అంతేలే అనుకోవచ్చు కానీ నాటి తరాన్ని నేటి తరాన్ని చూసిన కవిలా కాకపోయినా కనీసం అనుభవం తోనైనా ఏది మంచో ఏది చెడో చెప్పాల్సిన సినారె నేడు తను వీరతెలంగాణావాది నని చెప్పుకోవడం భావదారిద్ర్యం కాక మరేంటి?

ఇకనైనా శ్రీ సినారె తన పద్ధతి మార్చుకుంటారని ఆశిస్తూ,

ఒక అభిమాని 


  

Saturday, January 12, 2013

బుజ్జిగాడి మొదటి విదేశియానం

బుజ్జిగాడి మొదటి విదేశియానం

బుజ్జిగాడు (ముద్దుపేరు గున్ను ) మొదటిసారి అమ్మానాన్నల మాతృభూమి భారతదేశానికి నాలుగు నెలల సెలవులకి వెళ్ళాడు. డిసెంబర్ 10, 2012 న ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో అమ్మ తో కలిసి ఇండియా కి బయల్దేరాడు గున్ను.  ప్రయాణానికి 10 రోజుల ముందునుండే బుజ్జి గాడి నాన్న వాడిని వదిలి అన్నిరోజులు ఎలా ఉండాలా అని బాధ పడ్తుంటే బుజ్జి గాడికి అవేమి అర్థం కాలేదు పాపం. తీరా జర్నీ రోజు, చెక్-ఇన్ అంతా అయిపోయి సెక్యూరిటీ చెక్ లో వెళ్ళేదాకా బుజ్జి గాడు నాన్న చంకలోనే ఉన్నాడు. అమ్మ సెక్యూరిటీ చెక్కి  వెళ్ళాలి ఫ్లైట్ బయల్దేరే టైం అవుతుంది నాన్నకి బాయ్ చెప్పి నా దగ్గరికి రామ్మా గున్నూ అంటే బుజ్జిగాడు నాన్న చొక్కా పట్టుకొని గట్టిగ నాన్నకె అతు క్కుపోయాడు. అప్పుడు నాన్న గున్నుని బలవంతంగా అమ్మ కి ఇచ్చేసారు. అప్పుడు గున్నుగాడికి భలే కోపం వచ్చింది. కోపంగా నాన్న వంక ఒక చూపు చూసి అమ్మతో కలిసి సెక్యూరిటీ చెక్ ఏరియా లోకి వెళ్ళిపోయాడు.

అప్పుడు సెక్యూరిటీ చెక్ లో  TSA ఏజెంట్ అమ్మ దగ్గరున్న అన్ని బాగులు ఓపెన్ చేయమన్నాడు. అమ్మ ఆ హడావుడిలో ఉంటె అంతమంది జనాలని చూసి బుజ్జిగాడికి భయం వేసింది ఏమవుతున్దా అని. ఈలోగా అమ్మ ఒక బాగ్ లోనుంచి లాప్టాప్ తీస్తుంటే బుజ్జిగాడు  అది నాకు కావాలి అని అమ్మకి అడ్డం వచ్చాడు అమ్మ చుసుకోకపోవడంతో లాప్టాప్ బుజ్జి గాడికి తగిలి ఏడుపు లంగించుకున్నాడు బుజ్జి గాడు. మొత్తానికి  ఫ్లైట్ ఎక్కారు బుజ్జి గాడు అమ్మ. గున్ను గాడికి ఫ్లైట్ ఎంతగానో నచ్చింది. అంతమంది జనాలు ఒకచోట కూడితే ఇంక వాడికి పండగేకడా. అమ్మ TSA వాడితో పోట్లాడి మరీ తెచ్చిన 10 రకాల తినుబండారాలు (స్నాక్స్) ని అన్నిటిని నచ్చలేదని వదిలేసాడు గున్ను. బుజ్జిగాడికి ఇష్టమని ఎక్ష్ ట్రా ఫర్మ్ తోఫు తెమ్మంటే ఎక్ష్ ట్రా సాఫ్ట్ తోఫు తెచ్చిన మొగుడ్ని ముచ్చటగా ముప్పయ్యోసారి తిట్టుకుంది అమ్మ.

సరే, మొత్తానికి ఏదో తిన్నాడు బుజ్జి గాడు. నాప్ టైం అయిందేమో, అమ్మ బాసినేట్ లో పెట్టగానే పడుకుండిపోయాడు ఒక మూడు గంటలు.  లేచాక మళ్ళీ కొంచెం తిని ఆడుకున్నాడు. ఈలోగా ఫ్లైట్ ఢిల్లీ చేరుకుంది. అమ్మతో పాటుగా ఫ్లైట్ దిగిన బుజ్జిగాడు, ఢిల్లీ లో సెక్యూరిటీ చెక్ కి వెళ్ళే దారిలో అమ్మతో దాగుడుమూతలు ఆడాడు. మొత్తానికి మళ్లీ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరారు. అక్కడ లగేజ్ తీసుకొని, ఉన్నలేనట్టుండే ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ పూర్తి చేసుకొని కొద్దిసేపు వెయిట్ చేసాక బుజ్జిగాడి బాబాయి కాబ్ తీసుకొని వచ్చాడు. ఆ క్యాబ్ లో ఇంటికి వెళ్తుంటే బుజ్జి గాడికి భలే నచ్చింది. కార్ సీట్లో కుదేసే నాన్న లేరు, అమ్మ కూడా కార్ సీట్ లో కుర్చోమనలేదు. అసలు ఆ కార్ లో కార్ సీట్ లేనేలేదు. హాయిగా వాడికి ఇష్టం వచ్చినంత సేపు వెనక సీట్ మీదినుంచి డ్రైవర్ భుజం మీదకి వాలిపోయి రోడ్డు మీద కార్లు, బైకులు, లారీలు చూస్తుండగానే బాబాయి వాళ్ళ ఇల్లు వచ్చేసింది. అక్కడ అన్నయ్య పిన్ని కూడా ఉన్నారు. మూడు రోజులు బాగా ఎంజాయ్ చేసాడు అన్నయ్య తో ఆదుకున్నాడు. ఆ తర్వాత నాన్నమ్మ, అమ్మమ్మల దగ్గరికి బయల్దేరాడు. ఆ సంగతులన్నీ వచ్చే భాగంలో. మీ కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండే.



శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జిగాడు










Friday, January 11, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:

చాలా రోజులతర్వాత ఒక మంచి సినిమా చూసిన సంతృప్తి మిగిల్చింది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్రలు అంజలి (సీత), పెద్దోడు అండ్ చిన్నోడు (వాళ్ళెవరో చెప్పాల్సిన పని లేదనుకుంటా), ఇంకా ప్రకాష్ రాజ్. తన శైలికి భిన్నంగా ముఖాన ఒక నవ్వు తగిలించుకొని సినిమా అంతా లాగేసాడు ప్రకాష్ రాజ్. సహజ నటి జయసుధ గురించి చెప్పాల్సిన అవసరంలేదు...తల్లి పాత్ర లో చాలా ఉదాత్తంగా ఒదిగిపోయింది. సమంతా సినిమా అంతా నిండుగా బట్టల్లో కనిపించిన మొదటి మరియు చివరి సినిమా ఇదేనేమో.

ముఖ్యపాత్రలో అంజలి ఒదిగిపోయిన తీరు అద్భుతం. అందానికి అందం, అభినయానికి అభినయం. మరో సావిత్రి రేంజ్ లో కాకపోయినా మన సౌందర్య కి కాస్త అటూ ఇటుగా అంజలి నటన ఉంది. తెలుగు తెరకి ఒక నిఖార్సైన తెలుగు నాయికా ఇన్నాళ్ళకి దొరికింది..అందలం ఎక్కిస్తారో లాగేస్తారో ఇండస్ట్రీ ఇష్టం. నేను ఐతే అంజలి కి పూర్తిగా ఫిదా (బుజ్జీ, వింటున్నావా :) ) ...

కథ లోకి వెళ్తే: ఇద్దరు అన్నదమ్ములు, బాధ్యత లేని అన్న కి బాధ్యత గుర్తు చేయాలనీ చూసే తమ్ముడు; అన్న పైనే ఆశలు పెట్టుకున్న మేనత్త కూతురు సీత.  సీత తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో సీత బాబాయిలు సీత ని మేనమామ ప్రకాష్ రాజ్ వద్దనే వదిలేస్తారు. రెండు కుటుంబాల మధ్య రాకపోకలు తక్కువే. కానీ ఇటువి అటు అటువి ఇటు మోసే జిత్తులమారి చుట్టం తనికెళ్ళ. ఇలాంటి వాళ్ళు అందరి ఇళ్ళల్లోనూ ఉంటారే .

ఇంతకీ అన్నాతమ్ముళ్ళు బాధ్యత తెలుసుకున్నారా? సీత బాబాయిలు మామయ్యలు కలిసారా? సీత ని పెద్దోడు పెళ్లి  చేసుకున్నాడా?  అంతా వెండితెర మీద చూసి తరించగలరు.
క్లైమాక్స్ లో భద్రాచలం సీన్ సూపర్...అన్నట్టు పెద్దోడికి చిన్నోడికి ఒక చెల్లి కూడా ఉందండోయ్ కానీ అదేంటో చెల్లికి ఒక్క డైలాగ్ కూడా లేదు ఒక పాట మాత్రం ఉంది చెల్లి పెళ్లి కి











Wednesday, January 9, 2013

Story of a Donkey Horse and Elephant


Story of a Donkey Horse and Elephant
Donkey:

Everyone wants give it a kick seeing a Donkey. A Donkey weighs approx. 200 kgs, it can take up to 100 kgs weight. It eats all crap it could find on the street, and hardly requires supervision. If any Donkey didn't do its work, it gets beaten brutally. Donkey can never get anger, if it does, it gets beaten brutally.



Horse:

Everyone admires at a Horse for its strength and hyper. A Horse weights approx 500 kgs and it takes only a 70 kgs person. It gets the most nutritious food and there will be a person for every three horses to see their welfare. If a Horse didn't do its work properly, it gets beaten but very gently. If a Horse feels he is not getting enough care, it throws away its rider and gets special care.



Elephant:

Everyone first gets scared when they see and elephant and then they start to respect it. An Elephant weighs approx 3000 kgs and it hardly lifts 200 kgs of weight. An Elephant's welfare is taken care by one full time employ and during a special occasion there will be four dedicated people to take care of it. It eats most hygienic and tastier food than any other animal. If an elephant is angry, nobody even dare to go into its proximity.



With an elephant's expense, one can feed five to six horses daily. And with one horse's expense, minimum 10 donkey's can be fed. But no Donkey can complain on a Horse or an Elephant.

Disqus

Disqus to allow comment moderation